పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సంచలన నిజాలు!
పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సంచలన నిజాలు!

పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సంచలన నిజాలు!
ఈమె పేరు ప్రీతి. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా చదువుతుంది. చదువుల్లో చురుగ్గా ఉండే ప్రీతి.. ఇటీవల హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
ఓ పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన వరంగల్ లో తీవ్ర కలకలంగా మారుతోంది. మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా చదువుతున్న వైద్య విద్యార్థిని ఉన్నట్టుండి హానికరమైన ఇంజక్షన్ తీసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. అయితే ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇకపోతే ఈ ఘటనలో తాజాగా కొన్నిసంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ కు చెందిన ధరావత్ ప్రీతి అనే అమ్మాయి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా చదువుతుంది. ఆమె తండ్రి రైల్వే ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే చదువుల్లో చురుగ్గా ఉండే ప్రీతి ఇటీవల హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన తోటి స్నేహితులు, కాలేజీ సిబ్బంది ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.